క్రైమ్/లీగల్

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 2: జిల్లాలో పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను సోమవారం చిత్తూరు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. సిసిఎస్ డీఎస్పీ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల ద్విచక్రవాహనాలు చోరి అవుతున్న సంఘటనలు అధికంగా కావడంతో దీనిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిత్తూరు - తిరుపతి రోడ్డు పెనుమూరు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిసస్తున్న చంద్రగిరికి చెందిన ఆసిఫ్ (23) , ఖదీర్ (21) లను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసిందన్నారు. దీంతో ఇటీవల చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వీరే ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో, వీరు అపహరించిన ఎనిమిది ద్విచక్రవాహనాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.