క్రైమ్/లీగల్

దారి దోపిడీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం , ఏప్రిల్ 2: దారి దోపిడీలకు పాల్పడుతున్న కర్నాటకకు చెందిన ముగ్గురు యువకుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మారణాయుధాలు, కారు స్వాధీనం చేసుకొన్నట్లు కుప్పం సిఐ రాఘవన్ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం కుప్పం మండల పరిధిలోని ఊరినాయన పల్లి వద్ద ఏఎస్‌ఐ శేఖర్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కారు ఆగకుండా వెల్లడంతో అనుమానంతో వెంబడించి కారును పట్టుకొని పరిశీలించగా అందులో కత్తి కొన్ని ఇనుపరాడ్లు ఉండడంతో అనుమానంతో కారులో ఉన్న కర్నాటకకు చెందిన మునిరాజ్ (23) మునికృష్ణా (24) తాదేశ్ (24) లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసిందన్నారు. గత కొంత కాలంగా వీరు ముగ్గురు కుప్పం పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని మారణాయుధాలతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు, నగదును దోచుకొని పారిపోయే వారని, ఈ ముగ్గరిది కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా మూలూరు గ్రామమని, వీరు జల్సాలకు అలవాటు పడి ఈ దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు సిఐ వివరించారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేసి కారుతోపాటు అందులో ఉన్న కత్తి, ఇతర ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.