క్రైమ్/లీగల్

డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 2: డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో తమ పేర్లు కావాలనే తొలగించారని ఆరోపిస్తూ ఖమ్మం రూరల్ మండలం ఆరేకొడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. రూరల్ మండలం ఆరేకొడు గ్రామానికి చెందిన అప్పారావు, సురేష్ అనే వ్యక్తులు తమ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. కాగా తమకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు దక్కకుండా చేసేందుకు కొంత మంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నప్పటికి పట్టించుకోవటంలేదన్నారు. అరేకొడు గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఖమ్మం ఆర్డీవో పూర్ణచంద్రరావును కలిసేందుకు వచ్చినప్పటికి తమను పట్టించుకోవటం లేదని దీంతో నిరాశకు గురైన ఇరువురు ఆర్డీవో కార్యాలయంలో ఎదుటే ముందుగానే తీసుకువచ్చిన పురుగుల మందును సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన ఆర్డీవో కార్యాలయ సిబ్బంది వారికి హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో పూర్ణచంద్రరరావు దీనిపై అధికారులతో సమీక్షించి వారి సమస్యను పరిష్కారిస్తామని తెలిపారు. కాగా ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.