క్రైమ్/లీగల్

విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్బా, మార్చి 21: చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్-్ఛంపా జిల్లాలో ఓ ఘోరం సంఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు కామాంధులు ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిందేకాకుండా ఆమెకు విషం ఇచ్చారు. నలుగురు దుర్మార్గుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. బాధిత విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వారు చెప్పారు. రెండు వారాల క్రితం జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు నలుగుర్ని మంగళవారం అరెస్టు చేసినట్టు శియోరినారాయణ్ పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రశాంత్ మిశ్రా బుధవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం 12వ తరగతి విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన సాగర్ యాదవ్ (24) ఆమె మొబైల్‌కు ఫోన్‌చేసి రమ్మని పిలిచాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. సాగర్‌తోపాటు లవ్ నొనియా (28), విద్యార్థిని బైక్‌పై వెళ్లారు. అప్పటికే కుష్‌కుమార్ నొనియా (26), 16 ఏళ్ల బాలుడు అక్కడ పొంచి ఉన్నారు. నలుగురూ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి ఆమెకు విషం ఇచ్చారు. సంఘటనా స్థలం నుంచి ఆ దుర్మార్గులు పరారయ్యారు. అతికష్టం మీద ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పోలీసు అధికారి మిశ్రా తెలిపారు. హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బిలాస్‌పూర్‌కు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు రేపిస్టులను అరెస్టు చేశారు. మరో విషాదం ఏమిటంటే ఈ నెల 14నే ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.