క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, మార్చి 17: కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి సమీపంలో హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదారాబాద్‌కు చెందిన తొమ్మిది మంది స్నేహితులు క్వాలిస్ వాహనంలో ఆమనగల్లు వైపు వస్తుండగా కడ్తాల్ నుంచి వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో క్వాలిస్ వాహనంలో ప్రయాణిస్తున్న హైదారాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన ఎండీ ఫెరోజ్(25), ఓల్డ్ మాలక్‌పేటకు చెందిన సయ్యద్ సమీర్(24) అక్కడికక్కడే మృతిచెందారు. ఎండీ మోయిన్, వాహజ్, సయ్యద్ అబ్దుల్ ఖరీమ్, ఎండీ ఖాసీప్, అజ్గర్ అలీ, రియాజ్, ఎక్బాల్, అప్సర్‌కు త్రీవ గాయలయ్యాయి. సహాయ సహకరాలతో క్షత్రగ్రాతులను హైదారాబాద్ అసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్సై సుందరయ్య చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.