క్రైమ్/లీగల్

భార్య, మనుమరాలిపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగపాలెం, అక్టోబర్ 28: మానసిక ఒత్తిడికి గురై భార్యపై అనుమానంతో కత్తితో దాడిచేసి, అడ్డువచ్చిన మనుమరాలిపై కూడ దాడి చేసి గాయపరిచి, అనంతరం భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా ఘటన లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య, మనుమరాలు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధర్మాజీగూడెం ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం యడవల్లి గ్రామానికి చెందిన చిట్లూరి రంగారావు అలియాస్ శంకరాభరణం (55) ఆదివారం తెల్లవారుజామున భార్య రంగమ్మపై అనుమానంతో కత్తితో దాడిచేశాడు. దీన్ని చూసిన మనుమరాలు వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీనితో వరలక్ష్మిపై కూడా దాడిచేశాడు. ఈ ఘటనలో రంగమ్మ, వరలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం భయంతో రంగారావు గ్రామ శివార్లలో చెరువుగట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వస్తున్న గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని రంగారావు మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రంగమ్మ, వరలక్ష్మి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాంబాబు చెప్పారు.