క్రైమ్/లీగల్
ఎడ్లబండిపై నుంచి పడి రైతు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 February 2018
తలుపుల, ఫిబ్రవరి 27 : మండల పరిధిలోని మామిళ్లవారిపల్లికి చెందిన రైతు నరసింహారెడ్డి (64) మంగళవారం ప్రమాదవశాత్తు ఎడ్లబండిపై నుండి పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసింహారెడ్డి పొలం పనుల నిమిత్తం ఎడ్లబండిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.