క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు-కారు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఫిబ్రవరి 26: చిత్తూరు జిల్లా నారాయణ వనం మండల కేంద్రానికి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ముందువెళుతున్న లారీని అధిగమించడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొన్నాడు. ఈ ఘటనలో నవ వధువు సహా ముగ్గురు మృతి చెందగా, నవ వరుడు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతి చెందారు. చెన్నైలో వివాహం చేసుకుని కారులో శ్రీవారి దర్శనానికి వస్తున్న సందర్భంలో వడమాలపేట సమీపంలోని తుంబురు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్, నవవధువు అముదవల్లి (30) అక్కడికక్కడే మృతి చెందారు. వరుడు సహా మరో నలుగురు గాయపడడంతో వారిని తిరుపతి రుయాకు తరలించారు.