క్రైమ్/లీగల్

పార్కింగ్ చేసిన వాహనాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఆగస్టు 31: వైన్ షాపుల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకొని తిరుగుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.22 లక్షల విలువైన 47 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన దరా భాస్కర్(28), ఉపునూతల సంతోష్ (20) కలసి కొన్ని రోజులు గ్రామంలో ఉంటూ చిన్న చిన్న చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు. గ్రామం నుంచి నగరానికి వచ్చి కుషాయిగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నిత్యం అదే ప్రాంతంలో ఉన్న వైన్ షాపుల వద్ద మద్యం సేవించి పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనాలు చేయడం ప్రారంభించారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు వైన్‌షాపుల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు దొంగిలించి వీరికి స్నేహితులుగా ఉన్న పరమేష్, గణేష్, మల్లేష్‌కు తక్కువ ధరలకు విక్రయించి వచ్చిన డబ్బులతో విలాసాలు చేస్తున్నారు. పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు వాహనాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.