క్రైమ్/లీగల్

రోకలి బండతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచవరం, ఆగస్టు 16: కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను కోడలు రోకలి బండతో కొట్టి చంపింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపాలెంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొత్తపాలెంకు చెందిన కొయ్య సరోజనమ్మ (60) హత్యకు గురైంది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో కోడలు విజయలక్ష్మి రోకలి బండతో అత్తను చితకబాదింది. దీంతో సరోజనమ్మ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. అత్త, కోడళ్ల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరోజనమ్మ పిడుగురాళ్ల మండలం జూలకల్లులో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్లింది. తిరిగి కొత్తపాలెంకు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చింది. తరచూ తగాదాలు పెట్టుకుంటూ కూతురి ఇంటికి ఎందుకు వెళ్తున్నావంటూ కోడలు అత్తని నిలదీసింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో వంట గదిలో ఉన్న రోకలి బండ తీసుకుని అత్తపై దాడి చేసింది. ఇంటిలో ఆ సమయంలో ఎవరూ లేరు. తండ్రి, కొడుకు పొలం నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటి వెనక భాగాన ఉన్న వంట గదిలో సరోజనమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. ఇది చూసిన కుమారుడు కేకలు పెట్టాడు. సమాచారం పోలీసులకు అందింది. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ ఖాలేషావలి, పిడుగురాళ్ల రూరల్ సిఐ సుబ్బారావు, మాచవరం ఎస్‌ఐ జగదీష్ పరిశీలించారు. హత్యకు కోడలు విజయలక్ష్మి కారణమని ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి భర్త కొయ్య వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.