క్రైమ్/లీగల్

నదిలో ఇద్దరు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూలై 29: మండల పరిధిలోని మాదీపాడు అటవీ ప్రాంతంలోవున్న వన దేవత సత్తెమ్మతల్లి దర్శనానికి వచ్చి అక్కడవున్న పులిచింత ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం గల్లంతయ్యారు. అచ్చంపేట ఎస్‌ఐ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం పత్తిపాడు మండలం చినకొండ్రుపాడుకు చెందిన 9 మంది సభ్యులు రెండు ఆటోల్లో సత్తెమ్మ తల్లి దర్శనానికి వచ్చారు. అక్కడ వారు పూజల తరువాత పక్కనేవున్న పులిచింతల ప్రాజెక్టు చూడ్డానికి వెళ్లారు. అక్కడ హిందూ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఆరె శివబాబు కుమారుడు వెంకటేష్ (19), గుంటూరు శ్రీచైతన్యలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న కగ్గా శ్రీను కుమారుడు వెంకటేష్ (18) ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో స్నానానికి దిగారు. ఆ ప్రదేశంలో నది లోతుగా ఉండటంతో వారిద్దరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కిరణ్ వారికోసం వెతికించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలను ఆపేశారు. సోమవారం మళ్లీ గాలిస్తామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.