క్రైమ్/లీగల్
ఇన్ఫార్మర్ పేరుతో గిరిజనుడి హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గూడెంకొత్తవీధి, జూలై 28: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం చుక్కగొయ్యి గ్రామంలో శుక్రవారం రాత్రి మావోయిస్టులు మాజీ మిలీషియా సభ్యుడిని తుపాకీతో కాల్చి చంపారు. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల్లో నేఫధ్యంలో ఈసంఘటనకు పాల్పడడంతో మన్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చుక్కగొయ్యికి చెందిన వంతల బాలయ్య అలియాస్ జైరామ్ (శాలు) (25) మావోయిస్టు గాలికొండ దళంలో మిలీషియా సభ్యుడిగా 2013లో చేరాడు. ఏడాదిపాటు పని చేసిన జైరామ్ను తరువాత దళ సభ్యులు దూరం పెట్టారు. దీంతో ఉపాధి పేరుతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాడు. కొంతకాలం తరువాత స్వగ్రామానికి వచ్చి కుటుంబంతో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొనే్నళ్ళుగా మావోయిస్టులు ఇతడిని పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి హెచ్చరికలు చేస్తున్నారు. జైరామ్తో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తిని గతంలో అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు.