క్రైమ్/లీగల్

ముగ్గురు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/గంగాధరనెల్లూరు, జూలై 23: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు , గంగాధర నెల్లూరు ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి నుంచి ఒక కారు 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి మెట్టుమార్గంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదివారం రాత్రి కూంబింగ్ చేస్తుండగా మేకల బండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. వారిని పట్టుకోబోతే అందరూ అడవిలోకి పారిపోయారు. తమిళనాడుకు చెందిన ఒకరు మాత్రం పట్టుబడ్డాడు. ఇదిలావుండగా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని పాతపాళ్యం క్రాస్ వద్ద ఎర్రచందనం తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి 19దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.