క్రైమ్/లీగల్

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, జూలై 22: ఆగి ఉన్న లారీని వెనుకనుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆగిన్న లారీ ముందు నిల్చుని ఉన్న వ్యక్తిపైకి లారీ దూసుకెళ్లడంతో అతను మృతిచెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అద్దంకి-నర్కెట్‌పల్లి రహదారిలో వైదన సమీపంలోని పెట్రోలు బంకు వద్ద ఆదివారం వేకువజామున జరిగింది. ఈ ఘటనలో చత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన వరుడ బాలయ్య(43) అక్కడికక్కడే మృతిచెందగా హైదరాబాద్‌కు చెందిన కె నరసింహం, మరకటం కుమూ, పల్లెగోవర్దనరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుండి వస్తున్న ముకుంద పాల ట్యాంకర్ లారీలో బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులు చేసే బాలయ్య, కుమూ గోవర్దనరెడ్డి అద్దంకి వెళ్లేందుకు ఎక్కి ప్రయాణిస్తున్నారు. ముకుంద పాల ట్యాంకర్‌ను వైదన వద్ద ఆపి బోర్‌వెల్ సామానులు దించే వ్యవహారంలో ట్యాంకర్‌ను ఆపి లారీ ముందుకు వెళ్లారు. ఆగి ఉన్న ట్యాంకర్ వెనునుండి వేగంగా వస్తున్న తమిళనాడుకు చెందిన లారీ అదుపు తప్పి ఆగిన్న పాలట్యాకర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఆగిన్న ట్యాకర్ ముందు నిల్చుని ఉన్న ముగ్గురి మీదుగా రోడ్డు మార్జిన్‌కు దూసుకుపోయింది. వారిలో బాలయ్య మీదుగా లారీ ముందు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన కుమూ, గోవర్దన రెడ్డికి బలమైన గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ముకుంద పాల ట్యాకర్ లారీ డ్రైవర్ కట్టా వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎసై వై నాగరాజు కేసు నమోదు చేసి మృతదేహనికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి రెండు లారీల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.