క్రైమ్/లీగల్
ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 July 2018
రామగిరి, జూలై 22 : మండలంలోని ఎం.సీ.పల్లి గ్రామ సమీపంలోని పొలంలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం గరిమేకలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేష్ (27) తన పొలంలో ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకుంటూ వెనుకకు చూసి బోదులు పరిశీలిస్తుండడంతో ట్రాక్టర్ ముందున్న పాడుబావిలోకి వెళ్ళింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న నాగేష్ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని వారికి పెద్దగా శబ్దం రావడంతో అక్కడికి వెళ్ళి జరిగిన సంఘటనను మృతుని కుటుంబీకులకు, రామగిరి పోలీసులకు తెలిపారు. ఎస్ఐ విజయ్కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు.