క్రైమ్/లీగల్

బైకు, కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 21: మండల పరిధిలోని చందాపూర్ గ్రామ శివారులో బైకు, కారు ఢీ కొన్న సంఘటనలో బైకుపై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎఎస్‌ఐ క్రిష్ణయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ నుండి రాయిచూర్ వైపు వెళుత్ను టాటా ఇండిగో కారు ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్ చేయబోయ దాసర్‌పల్లి నుండి ఎదురుగా బైక్‌పై వస్తున్న వారిని ఢీ కొట్టడంతో గుంటెప్ప, సాయమ్మ, అనీల్ తీవ్ర గాయాలైనట్లు ఎఎస్‌ఐ తెలిపారు. గాయపడిన వారిని 108 లో మక్తల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా అసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహ్మద్‌అజామ్ నిర్లక్ష్యం కారణమని, కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.