క్రైమ్/లీగల్

తాళాలు వేసి ఉన్న ఇళ్లే దొంగలకు టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 21: పట్టణంలో చిల్లర దొంగతనాలు జోరుగా సాగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉందంటే చాలు చిల్లర దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. తాళాలు బద్దలుకొట్టి దొరికినకాడికి దక్కిందే చాలంటూ చేతికందిన వరకు తస్కరించుకుపోతున్నారు. ఇప్పటివరకు బాలాజీనగర్, కోఆపరేటీవ్ కాలనీల్లో చోరీలు చోటుచేసుకోగా తాజాగా స్థానిక దుడ్డువీధికి చెందిన పినిశెట్టి నారాయణరావు కుటుంబం ఊరికి వెళ్లడంతో దొంగలు తాళాలు పగులగొట్టి ఇంటిలోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇంటితాళాలు పగులగొట్టి ఇంటిలోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉంచిన 15వేల రూపాయల నగదును తస్కరించి అలికిడి కావడంతో ఎంచక్కా ఉడాయించారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన నారాయణరావు కుటుంబ సభ్యులు వారి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం, బీరువా తెరచి ఉండటం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మునాఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.