క్రైమ్/లీగల్
టిప్పర్ ఢీకొని వృద్ధురాలి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 July 2018
అవుకు, జూలై 21:పట్టణంలోని తేరుబజార్ వద్ద శనివారం టిప్పర్ ఢీకొని ఆరవోల కొండమ్మ(65) దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాలు.. బనగానపల్లె పట్టణానికి చెందిన కొండమ్మ పూసల వ్యాపారం రీత్యా ఉదయం అవుకు పట్టణానికి వచ్చింది. పూసల వ్యాపారం చేసుకుంటూ తేరుబజార్ వద్దకు రాగానే టిప్పర్ అతివేగంగా వచ్చి ఆమెను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చార. కాగా టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం కోసం కొండమ్మ మృతదేహాన్ని బనగానపల్లె ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.