క్రైమ్/లీగల్

మద్యం ఇప్పించలేదని బావమరిదిని హత్యచేసిన బావ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదెండ్ల, జూలై 21: మద్యం ఇప్పించలేదని సొంత బావమరిదినే బావ హత్య చేసిన ఘటన మండలంలోని సాతులూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కనపర్రు గ్రామానికి చెందిన కుంచాల జోజి (40) తాపీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన చెల్లెలు రమణను యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వల్లేపు శ్రీనుకు ఇచ్చి వివాహం చేశారు. శ్రీనుకు మద్యం అలవాటు ఉండడంతో శనివారం సాయంత్రం జోజిని సాతులూరు గ్రామానికి వెళ్ళి మద్యం ఇప్పించమని అడిగారు. శ్రీను వచ్చే లోపు కుంచాల పిన్నారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వీరిద్దరూ మద్యం దుకాణానికి వెళ్ళారు. వీరు ద్విచక్ర వాహనంపై కనపర్రు వెళుతూ ఉండగా, సాతులూరు మేజర్ కాలువ వద్దకు రాగానే తన బావ శ్రీను ఎదురయ్యాడు. ద్విచక్ర వాహానాన్ని ఆపి, తను వచ్చే లోపే మద్యం సేవించడం సహించలేక జోజిని కత్తితో దాడి చేసి, గాయపరిచారు. జోజి అక్కడికక్కడే మృతి చెందాడు. తన పక్కనే ఉన్న పిన్నారావు కనపర్రు గ్రామానికి పారిపోయి, జోజి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న డిఎస్పీ కె నాగేశ్వరరావు, రూరల్ సీఐ శోభన్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్‌బాబు తెలిపారు.