క్రైమ్/లీగల్

ఆటో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, జూలై 20: రాజాం మండలం శ్యాంపురం సమీపంలో రంగప్పచెరువు గట్టుపై నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు తాడ్డి లలిత, యు.మురళీ అనే విద్యార్థులు గాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నందబలగ నుంచి 20మంది విద్యార్థులతో వివిధ పాఠశాలలకు విద్యార్థులను ఆటోలో తీసుకొని వెళుతుండగా, మరో వైపు నుంచి ఇంకో స్కూల్‌బస్సు ఎదురుగా వస్తున్న సమయంలో బస్సును తప్పించబోయి పక్కనున్న గోతిలోకి ఆటో జారిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మిగతా విద్యార్థులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి పంపించివేశారు. ఈ మేరకు రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* పెను ప్రమాదమే తప్పింది...
రంగప్పచెరువులో పూర్తిస్థాయిలో నీరు ఉన్న సమయంలో తూర్పు వైపు ఆటో జారడంతో పెను ప్రమాదమే తప్పిందని, అదే ఆటో పడమర వైపు జారితే ఆటో నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉండేదని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు.