క్రైమ్/లీగల్
విషపుటీగల దాడి: గీత కార్మికుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 July 2018
మొగల్తూరు, జూలై 13: కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కుతున్న ఒక గీత కార్మికుడు విషపుటీగలు కుట్టడంతో మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుబ్బల పెద్దిరాజు (51) శుక్రవారం ఉదయం తాడి చెట్టు ఎక్కుతుండగా విషపుటీగలు దాడిచేశాయి. ఈగలు తీవ్రంగా కుట్టడంతో విషప్రభావానికి గురైన పెద్దిరాజును స్థానికులు ఆటోలో నరసాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని మొగల్తూరు ఎస్సై కె గురవయ్య తెలిపారు. పెద్దిరాజు అల్లుడు పీతాని వీర ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.