క్రైమ్/లీగల్

అటవీశాఖ అధికారుల అదుపులో ముగ్గురు నిందితులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూలై 7: జింక మాంసం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం మండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పొదలకూరు మండలం బిరుదవోలు గ్రామసమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక జింక గాయాలుపాలై పడిపోయింది. ఈ సంఘటనను గుర్తించిన వడ్లపూడి పంచాయతీ పరిధిలోని గొట్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు వెంటనే జింకను కోసి మాంసం విక్రయించారని సమాచారం. అదే గ్రామానికి చెందిన మల్లి మాధవయ్య, ఆయన భార్య ప్రభావతమ్మ, తల్లి కాంతమ్మ తమ ఇంటివద్ద జింకమాంసం ఎండపెట్టారని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే మరో కథనం మేరకు ఐదుగురు వ్యక్తులు వేటకు వెళ్లి జింకను చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, మిగిలిన వారు ఫరారరంటూ ప్రచారం జరుగుతోంది. విచారణ పూర్తయిన అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు చెపుతున్నారు.