క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 7 : జాతీయ రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేటకు చెందిన యాల్ల గణేశ్వరరావు(25) మృతి చెందాడు. గణేశ్వరరావు నరసన్నపేట నుండి శ్రీకాకుళం వైపు మోటారు బైక్ పై వెళ్తుండగా ముందులో రోడ్డు రోలర్, లారీ లను కేంద్రీయ విద్యాలయం సమీపంలో వోవర్‌టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేయడంతో బండి స్కిడ్ అయి బోల్తా పడ్డాడు. తలకు తీవ్రమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీ ఐ, రూరల్ ఎస్ ఐ సంఘటన స్ధలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.