క్రైమ్/లీగల్

ఆరేళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 1: అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం రజక కాలనీలో ఈ సంఘటన జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తడ ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రజక కాలనీలో నివాసముంటున్న ఓ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కుమార్తె ఆరంబాకం సమీపంలోని ఓ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం బాలిక తల్లి పనికి వెళ్లగా బాలిక ఇంటిలో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన అదే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు ఆ బాలికను బలవంతంగా నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తరువాత బాలిక అనారోగ్యానికి గురై రక్తస్రావం కావడంతో తల్లి బంధువులు బాలికను వివరాలు అడగటంతో జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆమె బంధువులు ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేశారు. కేసును రాజీ చేయడానికి ప్రయత్నాలు చేశారు.కుదరదని ఎస్సై ఖరాఖండిగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక పెద్దమనుషులు నిందితులైన ఇద్దరు బాలురను స్టేషన్‌లో అప్పగించారు. వీరిద్దరిని కోర్టుకు హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు.