క్రైమ్/లీగల్

క్రషర్‌లో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 1: మండల పరిధిలోని నీలకంఠ స్టోన్ క్రషర్‌లో ప్రమాదవశాత్తు సోమ్లానాయక్ (45) అనే వ్యక్తి పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కేఎస్ తండాకు చెందిన సోమ్లానాయక్ గత కొంతకాలంగా నీలకంఠాపురంలోని క్రషర్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద ఉన్న క్రషర్‌లోకి ఇరుక్కుపోయాడు. దీన్ని గమనించిన కూలీలు క్రషర్‌ను నిలిపివేసి అతన్ని చికిత్స నిమిత్తం మధుగిరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్య మృతి చెందాడు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలు పూర్తిగా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.