క్రైమ్/లీగల్

మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు సజీవ సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, జూన్ 29: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం ఉదయం మరుగుదొడ్డి ట్యాంకు నిర్మాణంలో పాల్గొన్న ఇద్దరు కూలీలు మట్టిపెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయ్యారు. వివరాలిలావున్నాయి... పోతవరం గ్రామానికి చెందిన పసుపులేటి సత్యనారాయణ కొత్త ఇంటి నిర్మాణంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మరుగుదొడ్డి ట్యాంకుల నిమిత్తం గోతులు తవ్వి, వాటిలో సిమెంటు ఒరలు అమర్చే పనిచేపట్టారు. శుక్రవారం ఉదయం నలుగురు కూలీలు ఈ పనుల్లో నిమగ్నమై ఉండగా, హఠాత్తుగా పైనుండి మట్టిపెళ్లలు విరిగి గోతిలో ఉన్నవారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన రాజనాల శ్రీను (33), గుర్రం కోటేశ్వరరావు (35) మట్టిపెడలుకింద పడి మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూలీలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇంటి యజమాని స్పందించి, పొక్లయినర్ సహాయంతో హుటాహుటిన మట్టిపెళ్లలు తొలగించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మూర్తి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
కేసు నమోదు జేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.