క్రైమ్/లీగల్

రేపిస్టులకు 20ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), జూన్ 29: కామంతో కళ్లు మూసుకుపోయి అనారోగ్యంతో ఒంటరిగా ఉన్న బాలిక (18)ని నమ్మించి మాయ మాటలతో లొంగదీసుకొని అత్యాచారం జరిపిన రాజ్‌కుమార్ (22), మహ్మద్ సమీర్ (20)లకు కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం 20 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన బాలిక జిల్లా కేంద్రమైన జనగామలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి సొంత గ్రామానికి వెళ్లింది. సెలవులలో పెద్దపల్లిలో ఉంటు న్న తన అక్క ఇంటి వద్దకు 2013 సంవత్సరం ఏప్రిల్ 15న రైలులో బయలుదేరి రామగుండంకు చేరింది. అక్కడే రైలుకోసం ఎదురుచూస్తున్న యువకులు ఒంటరిగా కనిపిస్తున్న బాలికను గమనించారు. ఆ బాలికను లొంగదీసుకొని మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారావు వాదించారు. కేసుపై తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నాగరాజు ఇరువురు నిందితులకు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించారు.