క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందవరం, జూన్ 29: గ్రూప్ సర్ట్ఫికెట్ జారీ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా నందవరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామారావును శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నందవరం మండలం కనకవీడుగ్రామానికి చెందిన రంగన్న కుటుంబ సభ్యుల గ్రూపు సర్ట్ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సర్ట్ఫికెట్ ఇవ్వాలంటే రూ.4వేలు లంచం ఇవ్వాలని ఆర్‌ఐ రామారావు డిమాండ్ చేశాడు. దీనికి అంగీకరించిన రంగన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆర్‌ఐకి రూ.4 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.