క్రైమ్/లీగల్

జ్వరంతో విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, అక్టోబర్ 29: జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడులో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఉనమట్ల రాంబాబు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమార్తె ప్రసన్న (16) జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమెకు గత పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావటంతో ఈ నెల 23న విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స అందజేసిన వైద్యులు ప్లెట్‌లెట్స్ తగ్గిపోయాయంటూ ఆమెకు రక్తం కూడా ఎక్కించారు. అయినా ఫలితం లేకపోయింది. జ్వరం తీవ్రత ఎక్కువై సోమవారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. అందరితో కలసిమెలసి ఉండే ప్రసన్న మృతిచెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.