క్రైమ్/లీగల్

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రైలులో గుట్టుగా రవాణా చేస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపురూ. 12 లక్షలు ఉంటుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గరు వ్యక్తులను దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ పోలీసులతో పాటు ఏపీ ఎక్సైజ్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల్లో వారు పట్టుబడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులకు గంజాయి ముఠా దొరికిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం- గుంటూరు మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)లో గోనె సంచుల్లో గంజాయిని దాచి రవాణా చేయడానికి ప్రయత్నించిన ముఠాను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులను గుంటూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు పర్చగా, ముగ్గురిని రిమాండ్‌కు పంపారు.

*చిత్రం...రైలులో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న రైర్వే పోలీసులు