క్రైమ్/లీగల్

ఒంగోలు శివారులో గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 22: ఒంగోలు శివారున మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు కేశవరాజుకుంట శివారులోని చిల్లచెట్ల పొదలో ఒక మహిళ అపస్మారక స్థితిలో వివస్తగ్రా పడి ఉంది. ఆమె పక్కనే దుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడి ఉన్నట్లు సమాచారం. మహిళ పై గ్యాంగ్‌రేప్ జరిగి ఉంటుందని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పనులకు వెడుతున్న స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించి పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట గ్రామానికి చెందిన బి.పోలమ్మ(32)గా పోలీసులు గుర్తించారు. బాధితురాలికి తెలిసిన వ్యక్తులే ఆమెను బుధవారం తెల్లవారుజామున శివారు ప్రాంతానికి రప్పించి అత్యాచారానికి పాల్పడటమో, లేక కిడ్నాప్ చేసిన అనంతరం దారుణానికి ఒడిగట్టడమో చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన పోలమ్మ మృతదేహాన్ని ఒంగోలు డి ఎస్‌పి ప్రసాద్, ట్రైనీ ఐపియస్ జగదీష్, ఒంగోలు తాలూకా సి ఐ యం లక్ష్మణ్ తదితరులు పరిశీలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాల గురించి పోలీసులను వివరణ కోరగా ఇంకా పూర్తి సమాచారం రాలేదని, సమాచారం వచ్చిన తరువాత వివరాలు తెలియజేస్తామని తెలిపారు.