క్రైమ్/లీగల్

గంజాయి పట్టివేత : ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 18: గంజాయిని తాగుతూ యువకులకు విక్రయిస్తున్న ముగ్గురిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి వీరి వద్ద రూ.లక్ష విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. చెంగిచర్ల కాకతీయ కాలనీలో నివసిస్తున్న నిజామాబాద్‌కు చెందిన నేత విశాల్ సైమన్ (22), నల్గొండ చౌటుప్పల్ అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన మునుకుంట్ల పవన్ (21), ఉప్పల్ కుమ్మరిబస్తీలో నివసిస్తున్న మంగమ్మలు రాజమండ్రి అరక్ నుంచి తెప్పించిన గంజాయిని ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు, యువకులకు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తప్పును ఒప్పుకున్నారు. వీరిని కోర్టుకు రిమాండ్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.