ఇదిగో.. ఓ ప్రేమలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఎస్.పి.నాయుడు నిర్మాతగా టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు టి.కరణ్‌రాజ్ మాట్లాడుతూ,‘ఇదో అందమైన ప్రేమకథ. ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ మేఘమాల కథ. నటీనటులు, టెక్నీషియన్లు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంద’ని అన్నారు.నిర్మాత ఎస్.సి.నాయుడు మాట్లాడుతూ- ‘దర్శకుడు కరణ్‌రాజ్ ఓ మంచి కథా చిత్రాన్ని ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. వందేమాతరం అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిపాము. అరకులోని సుందరమైన లొకేషన్లలో రెండు పాటలను చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి చిత్రంగా ‘ఇదో ప్రేమలోకం’ ఉంటుంద’ని అన్నారు. కారుణ్య, సుమన్, నరేష్, భగవాన్, మేల్కొటె, దేవిశ్రీ, ప్రభావతి, ఎస్.పి.నాయుడు, టి.చంద్రమహేష్, అశోక్‌కుమార్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం:వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:కె.శివ, నిర్మాత:ఎస్.పి.నాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:టి.కరణ్‌రాజ్.