21న ఇజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ఆడియోకు భారీ స్పందన లభిస్తోందని, తన కెరీర్‌లోనే ఓ వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు సోషల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ఇంటర్నేషనల్ బ్లాక్‌మనీ వ్యవస్థ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్, అనానిమస్ కార్యకలాపాలు లాంటి అంశాలను ఈ చిత్రంలో చర్చించామని, ఈనెల 21న తమ అభిమానులకు పండుగలా ఈ చిత్రం విడుదలవుతోందని కల్యాణ్‌రామ్ అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, సిక్స్‌ప్యాక్‌తో టోటల్‌గా న్యూలుక్‌తో కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కన్పిస్తారని, సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోందని దర్శకుడు పూరి జగన్నాధ్ తెలిపారు. జర్నలిజంలోవున్న ఇజాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన ఈ సినిమాలో మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అతిథి ఆర్య కథానాయికగా నటించిందని, భారీ బడ్జెట్‌తో స్పెయిన్ చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని ఆయన అన్నారు.