ఒక్కడు మిగిలాడు నిర్మాతపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్ర షూటింగ్ విశాఖలో జరుగుతోంది. చిత్ర నిర్మాత, జూ.ఆర్టిస్టు ఏజెంట్లమధ్య నగదు చెల్లింపు విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతపై ఏజెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పరవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విశాఖ జిల్లా పరవాడ మండలం, ముత్యాలమ్మ పాలెంలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ను రూపొందించారు. అక్కడ షూటింగ్ జరుపుతుండగా, దీనికోసం కావాల్సిన జూ. ఆర్టిస్టులను స్థానికంగా వున్న ఏజెంట్ల ద్వారా పిలిపించుకొని వారితో షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, నిన్న రాత్రి కొంతమంది జూ.ఆర్టిస్టు ఏజెంట్లు నిర్మాతను లాక్కొచ్చి యూనిట్ సభ్యుల ఎదుటే దాడిచేశారని హీరో మంచు మనోజ్ తెలిపారు. జూ.ఆర్టిస్టుల డబ్బుల లావాదేవీల విషయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఏదైనా సమస్య వుంటే పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలిగానీ, నిర్మాతపై దాడికి పాల్పడడం సరికాదని మనోజ్ తెలిపాడు. ఈ సంఘటనపై పరవాడ పోలీసులకు నిర్మాత ఫిర్యాదు చేశారు.