పవన్కు తెలీదు... అల్లరంతా అభిమానులదే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఓ సినిమా వేడుకకు వచ్చినపుడు ఎంతో చెప్పాలని స్టేజీమీదకు వస్తే ‘పవర్స్టార్ పవర్స్టార్’ అని అరవడంవల్ల ఏమీ చెప్పకుండా వెళ్లిపోతున్నా. నేనేకాదు, ఎంతోమంది ఏదో చెప్పాలని వస్తే, పవన్ ఫ్యాన్స్ రూపంలోవున్నవారు అల్లరి చేయడంతో ఎవరూ ఏమీ సినిమా గురించి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు’ అని హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీ్ధర్ రూపొందించిన ‘ఒక మనసు’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో రామ్చరణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని నాగబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆడియో వేడుకలో వేడుకలో అల్లు అర్జున్ పైవిధంగా స్పందించారు. పవర్ స్టార్ అని అరిచినపుడల్లా తాను మాట్లాడకుండా వెళ్లిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం కాదని, అసలు ఆయనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు ఆడియో వేడుకకు వచ్చి గ్రూప్గా ఏర్పడి అరచి గోలచేయడమే పనిగా పెట్టుకున్నారని, ఎవరినీ ఏమీ మాట్లాడనివ్వకుండా అల్లరి చేస్తున్నారని ఆయన తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర హీరోలకు కూడా గౌరవాన్ని ఇవ్వాలని, దానివల్ల మనం పెరుగుతామే కానీ తగ్గమని అన్నారు. ఒకరి వేడుకలో మరొకరి గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తోందని, పవన్కళ్యాణ్ గురించి తాను ఎన్నోసార్లు చెప్పానని, మళ్లీ మళ్లీ అలాగే అల్లరిచేయడం భావ్యంకాదని ఆయన వివరించారు. ఇంత పెద్ద ఫ్లాట్ఫామ్ వేసిన చిరంజీవి గురించి ఎవరూ మాట్లాడకపోయినా, పవర్స్టార్ గురించే మాట్లాడమని చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. దయచేసి నన్ను ఇష్టపడే అభిమానులకు ఓ వినతిగా ఈ మాట చెబుతున్నానని, సోషల్ మీడియాలో వెర్బల్ వార్ ఆపడానికి కృషిచేయమని ఆయన పిలుపునిచ్చారు. మనల్ని మనం తగ్గించుకునే ఈ చీప్ వార్ ముగిద్దామని, తనవలన చిరంజీవి కుటుంబానికి ఏ మచ్చ రావడం తనకు ఇష్టంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చిత్ర దర్శకులు రామరాజు మాట్లాడుతూ, మల్లెల తీరం తరువాత తాను ఈ చిత్రం చేయకూడదనే అనుకున్నా, చంద్రవౌళి ప్రోత్సాహంతో ఈ సినిమా చేశానని, శౌర్య, నిహారిక, తానూ కలిసి తయారుచేసుకున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారని అన్నారు. ఇప్పుడిప్పుడే తాను హీరోయిన్గా అడుగులు వేస్తున్నానని, నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా రూపొందించారని, అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా వుంటుందో ఈ సినిమా కూడా అంతే స్వచ్ఛంగా వుంటుందని కథానాయిక నిహారిక తెలిపారు. నిహారికకు మంచి కథ ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలని, అందరూ హీరోలు వున్న కుటుంబం నుండి ఒకమ్మాయి హీరోయిన్గా రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేని విషయమైనా, నిహారిక తనను ప్రశ్నతోనే ఒప్పించిందని నాగబాబు అన్నారు. నిహారిక కథానాయికగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని రామ్చరణ్ అన్నారు.