కోటి రూపాయల సెట్‌లో దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధి, రఘు ముఖర్జి ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం-2’. గతంలో విడుదలైన దండుపాళ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తిచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ- 40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌లో 70 శాతం చిత్రాన్ని బెంగుళూరు, బెల్గాంలలో పూర్తిచేశామని, మొదటి సినిమా తరువాత మరో వైవిధ్యమైన కథనంతో సీక్వెల్‌గా చేస్తున్నామని, ఒక నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఈ చిత్రంలో చూపుతున్నామని తెలిపారు. బెంగుళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని, మూడేళ్ల క్రితం విడుదలైన దండుపాళ్యం సీక్వెల్‌గా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నామని నిర్మాత వెంకట్ అన్నారు. జూన్, జూలైల్లో షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీనివాసరాజు.