బిజినెస్

సంక్రాంతికి 8 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: సంక్రాంతి సందర్భంగా విశాఖ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే నగరవాసుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 12.19 తేదీల్లో (08523- 08524) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు 4 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖ- విజయవాడకు (08525- 08526) 4ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు డబల్‌డక్కర్ ఏసీ రైళును నడుపుతున్నారు. విశాఖ- సికింద్రాబాద్‌కు ఈనెల 12వ తేదీన విశాఖలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈనెల 13,20 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరుతంది. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఈనెల 12న సాయంత్ర 5.45 గంటలకు బయలుదేరి ఆదే రోజు రాత్రి 8.20 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఆదేరోజు రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు ఈనెల 11వ తేదీన ప్రత్యేక రైళును నడుపుతారు. 08751 రైలు సికింద్రాబాద్‌లో 11న సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు నెల్లూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.