బిజినెస్

సీతారామన్‌తో పారిశ్రామిక దిగ్గజాల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత్-అమెరికా సిఇఒ ఫోరమ్ సమావేశం మంగళవారం జరగనున్న క్రమంలో సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశీయ అగ్రశ్రేణి సంస్థల సిఇఒలు కలిశారు. ఇంధనం, తయారీ తదితర కీలక రంగాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైరస్ మిస్ర్తి, సునీల్ మిట్టల్, చందా కొచ్చర్, దీపక్ పరేఖ్, ఆనంద్ మహీంద్ర తదితర ప్రముఖులు సీతారామన్‌తో సమావేశమైన వారిలో ఉన్నారు. కాగా, భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశాలున్నాయని మంత్రి అన్నారు. బ్రిటన్ ప్రతినిధితో జరిగిన సమావేశంలో ఆమె ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశారు. సైరస్ మిస్ర్తి సోమవారం టెలికామ్ మంత్రి మనోజ్ సిన్హానూ కలిశారు.