బిజినెస్

స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 10 పైసల చొప్పున పెరిగాయి. డీలర్లకు చెల్లించే కమీషన్ పెంచడంతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకే చమురు సంస్థలు ఈ పెంపునకు దిగాయి. కాగా, పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 64.72 రూపాయలు, డీజిల్ ధర 52.61 రూపాయలకు చేరింది.
తగ్గిన సత్య నాదెళ్ల జీతం
న్యూయార్క్, అక్టోబర్ 4: మైక్రోసాఫ్ట్ చీఫ్, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల వేతనం ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 0.6 మిలియన్ డాలర్లు తగ్గింది. 17.7 మిలియన్ డాలర్ల (దాదాపు 117.7 కోట్ల రూపాయలు)కు పరిమితమైంది. ఇందులో 4.4 మిలియన్ డాలర్ల బోనస్ కూడా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నాదెళ్ల 18.3 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని పొందారు.