బిజినెస్
మూడు కెమెరాల ముచ్చటైన మొబైల్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 1: కొరియా టెక్నాలజీ దిగ్గజం ఎల్జి బుధవారం దేశీయ మార్కెట్కు మూడు కెమెరాలున్న స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. జి5 పేరుతో వచ్చిన దీన్ని గుర్గావ్లో ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి కిమ్ కి వాన్ ఆవిష్కరించారు. దీని ధర 52,990 రూపాయలు. మాడ్యులర్ డిజైన్లో వచ్చిన జి5లో 16 మెగాపిక్సల్ ప్రైమరీ రేర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతోపాటు వైడ్-యాంగిల్ షాట్స్ కోసం మరో 8 మెగాపిక్సల్ రేర్ కెమెరాలు ఉన్నాయ. అంతేగాక 5.3 అంగుళాల స్క్రీన్ కలిగిన దీనిలో 4జిబి ర్యామ్ ఉంది. ఇక ఈ సరికొత్త ఫోన్ 32జిబి మెమరీనేగాకుండా మరో 2టిబి మెమరీని సపోర్ట్ చేస్తుంది. దీంతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా సామ్సంగ్, యాపిల్, సోని మొబైల్స్కు తమ జి5 గట్టిపోటినిస్తుందని ఎల్జి విశ్వసిస్తోంది.
chitram..
బుధవారం గుర్గావ్లో ఫ్యాషన్ డిజైనర్ నిష్కా లుల్లాతో కలిసి
సరికొత్త జి5 మాడ్యులర్ స్మార్ట్ఫోన్ను మార్కెట్కు పరిచయం చేస్తున్న ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి కిమ్ కి వాన్