బిజినెస్
హైదరాబాద్ మార్కెట్లోకి ఫోర్డ్ ఎండీవర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. హైదరాబాద్లో బుధవారం తమ కొత్త కారును ఆవిష్కరించింది. సరికొత్త ఎండీవర్ ఎస్యువి కారును పరిచయం చేసింది. రెండు రకాల శక్తివంతమైన, ఇంధన పొదుపు సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో ఎండీవర్ను డిజైన్ చేసినట్లు ఈ సందర్భంగా ఫోర్డ్ తెలియజేసింది. 2.2 లీటర్, 3.2 లీటర్ ఇంజిన్లతో ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ కారును బుధవారం ముంబయిలోనూ ఆవిష్కరించగా, ముంబయి ఎక్స్షోరూం ప్రకారం ధర 24.75 లక్షల రూపాయలు, 27.7 లక్షల రూపాయలుగా ఉన్నాయి. తమ ఈ న్యూ ప్రీమియం ఎస్యువి ఎండీవర్ కస్టమర్లను ఆకట్టుకోగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఫోర్డ్ వ్యక్తం చేసింది.
బుధవారం హైదరాబాద్లో ఫోర్డ్ ఎండీవర్ను మార్కెట్కు పరిచయం చేస్తున్న దృశ్యం
రిటైల్ రంగంలోకి ఒరిగో కమోడిటీస్
హైదరాబాద్, జనవరి 20: వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో ప్రముఖ సంస్థ అయిన ఒరిగో కమోడిటీస్ ఒరిగోఫార్మ్స్ ద్వారా రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై ఒరిగోఫార్మ్స్.. తృణధాన్యాలు, పప్పు్ధన్యాలు, వేరుశనగపప్పు, బియ్యం, మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలను అమ్మనుంది. హైదరాబాద్లోని ప్రముఖ రిటైల్ సంస్థలైన హైపర్ సిటీ, స్పార్ ఇతర స్టోర్లలో తక్కువ ధరకే వీటిని విక్రయించడం జరుగుతుందని ఒరిగోఫార్మ్స్ బుధవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఒరిగోఫార్మ్స్ ముందుకెళ్తోందని ఈ సందర్భంగా ఒరిగో కమోడిటీస్ డైరక్టర్ సునూర్ కౌల్ అన్నారు.
హైదరాబాద్లో బుధవారం ఒరిగోఫార్మ్స్ ఉత్పత్తులను విడుదల చేస్తున్న సంస్థ ప్రతినిధులు
సింగపూర్కు మరిన్ని ‘టైగర్’ సర్వీసులు
హైదరాబాద్, జనవరి 20: సింగపూర్కు హైదరాబాద్, తిరుచిరాపల్లి నుంచి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు టైగర్ ఎయిర్లైన్స్ బుధవారం ప్రకటించింది. సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టైగర్ ఎయిర్లైన్స్.. ఈ అదనపు విమాన సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్య నడపనుంది. కాగా, హైదరాబాద్-సింగపూర్ మధ్య వారానికి ఏడు విమాన సర్వీసులు, తిరుచిరాపల్లి-సింగపూర్ మధ్య వారానికి 14 విమాన సర్వీసులను నడపనున్నట్లు టైగర్ ఎయిర్లైన్స్ ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు టైగర్ ఎయిర్లైన్స్ వివరించింది.
బుధవారం కొత్త విమాన సర్వీసులను ప్రకటిస్తున్న టైగర్ ఎయిర్లైన్స్ యాజమాన్యం