బిజినెస్
మారుతి, హ్యుందాయ్కి ‘ధనత్రయోదశి’ అమ్మకాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 October 2016
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: మారుతి సుజుకి, హ్యుందాయ్.. ‘్ధనత్రయోదశి’ సందర్భంగా శుక్రవారం 45 వేలకుపైగా కార్లను విక్రయించాయి. సుమారు 30,000 వాహనాలను అమ్మినట్లు మారుతి సుజుకి పేర్కొనగా, నిరుడుతో పోల్చితే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం. ఇక 15,153 వాహనాలను విక్రయించామని హ్యుందాయ్ స్పష్టం చేసింది. గత సంవత్సరంతో పోల్చితే ఇది 26 శాతం ఎక్కువని తెలిపింది. కాగా, ‘్ధనత్రయోదశి’ అమ్మకాల నేపథ్యంలో ఈ నెల సంస్థ అమ్మకాలు 50,000 యూనిట్లను చేరవచ్చని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ అధ్యక్షుడు రాకేశ్ శ్రీవాత్సవ పిటిఐకి తెలిపారు. సమృద్ధిగా కురిసిన వర్షాలు కొనుగోళ్లను పెంచాయని అభిప్రాయపడ్డారు.