క్రైమ్/లీగల్

మోటారు బైక్ అదుపు తప్పి.. ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం,అక్టోబర్ 27: జన్నారం మండలం బొమ్మెన రహదారి సమీపంలో మూలమలుపు వద్ద శనివారం సాయంత్రం మోటారు బైక్ అదుపుతప్పి పెద్ద బండరాయిని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం దండేపల్లి మండలం కస్పెల్లి గ్రామానికి చెందిన పుట్టపాక అంజయ్య(45), ప్రకాశం జిల్లా గిద్దెలూరుకు చెందిన వనపర్తి మరిదాసు (50) ఇద్దరు స్నేహితులు మేదరిపేటలో జీవనం సాగిస్తున్నారు. దినసరి కూలి పనుల నిమిత్తం వీరిద్దరు శనివారం సాయంత్రం మోటారు బైక్‌పై మేదర్‌పేట్ నుండి జన్నారంకు వస్తుండగా బొమ్మెన రహదారి సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి అతివేగంతో బండరాయిని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు ఏఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లక్సెటిపేట ఆసుపత్రికి తరలించారు.