క్రైమ్/లీగల్

అప్పుల భారంతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు,మార్చి 19: పంట దిగుబడులు రాక, చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక జీవితంపై ఆశలుతెంచుకొని సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఇద్దరు రైతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే కజ్జర్ల గ్రామానికి చెందిన కొల్లేటివార్ విజయ్ (65) తనకున్న మూడెకరాల పంట చేనులో పత్తిపంట వేయగా పంట తెగుళ్ళు సోకి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీవ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తిచెంది సోమవారం మధ్యాహ్నం తన పశువుల పాకలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుమారుడు కృష్ణ అందించిన సమాచారం మేరకు తలమడుగు ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తుసాగిస్తున్నారు. అదే విధంగా ఇదే మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన ఎల్చల్‌వార్ రోజా (30) తన భర్త ఆరోగ్యం విషమించడంతో పాటు వైద్యానికి ఆర్థిక స్థోమతలేక బతుకుపై విరక్తిచెంది తన ఇంట్లో దులానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి దేవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామ నిర్వహించి, దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై పైడిసుబ్బారావు తెలిపారు