S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/06/2018 - 21:53

విభూతి ధారణ వల్ల ముక్తి లభ్యం. ఇది అందరకూ తెలిసిన విషయమే. పునర్జన్మ కలుగదు. విభూతి అనే మాట కు సంపద అనే అర్థం ఉంది.సంపదలు రెండు రకాలు. లౌకికము, అధ్యాత్మికము అని వీటిని చెప్పుకోవచ్చు. భగవంతుని అనుగ్రహం కూడా సంపదే. శైవ సంప్రదాయంలో విభూతికి చాలా ప్రాధాన్యం ఉంది. షట్కాల శివపూజ అంటే శివుణ్ణి ఆరుసార్లు పూజించడం అనిఅర్థం. అష్టావర్ణములు అనగా భస్మ, రుద్రాక్ష, పాదోదకం, వంటి ఎనిమిది ముఖ్య శివాచారములు.

02/05/2018 - 20:53

మనం నిత్యం పాటించే సంప్రదాయాల్లో ‘నమస్కారం’ ప్రధానమైంది. మనలోని వినయాన్ని చాటుకోవాలంటే ‘నమస్కారా’న్ని అవతలి వారి హృదయాన్ని తాకేలా నమ్రతతో కూడుకొని ఉండాలి. సంప్రదాయంలో ‘నమస్కారం’ అనే మాటకు యోగఫలసిద్ధికి చేసే ప్రణామమనే అర్ధం ఉంది. ప్రణామమంటే ‘నమస్కారమ్’ ప్రణిపాతం అని భగవద్గీత దీనే్న ప్రస్తావించింది. నమస్కారంలో మనిషి నిజాయితీ వ్యక్తవౌతుంది. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి’ అన్నారు.

02/04/2018 - 21:05

అణిమా, మహిమా,చ ఇవ, గరిమా,లఘిమా, తద్మా
ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశత్వ, వశత్వంచ, అష్ట్భూతయః

02/04/2018 - 21:02

కాబట్టి ద్రుపదుని బలాన్ని అణచివేద్దామని తలపోశారు.
ఈ బ్రాహ్మణునితో మనకేమి పని. అతడు చేసిన తప్పేమిటి? రాజులందరినీ మోసం చేసిన ద్రుపదుని వదలగూడదు అని ద్రుపదునిపైకి దండెత్తి రాగా ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల చాటున చేరాడు.
అది చూచిన అర్జునుడు- ‘‘నా అస్త్రంచే ద్రుపదుడిపై దండెత్తిన శత్రువులను అణచివేస్తాను. మీరు ప్రక్కకు తొలగి చూస్తుండండి’’ అని అన్నాడు.

02/04/2018 - 21:00

ఆహారం తిన్నందే ఏ జీవి కూడా ప్రాణాలతో ఎక్కువ సేపు ఉండలేదు. ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తారు. కాని ఆ ఉపవాసాలు ఎక్కువైతే ఆహారం తక్కువై మనిషి నీరసించి పోతాడు. అందుకే మనకు ముఖ్య ఆహారం అన్నం కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు.

02/04/2018 - 20:58

దేవదానవులు కలసి అమృతాన్ని సాధించడం కోసం సముద్రాన్ని మధించారు. ఆ సముద్ర మథన సమయంలో వెలువడిన (గరళం) హలాహలాన్ని మ్రింగిన శివుడు, ఆ విషవాయువుల ప్రభావంతో కుంచించుకున్నాడా అన్నట్లు సగమై చిక్కితే, ఎపుడూ భర్తనంటి ఉండే ఆది యిల్లాలు ఆ శైలపుత్రి, భర్త ఒంటిలోని వేడికి తానూ సగమైనదట. ఆ యిరువురి సగాలు కల్సి ఒక శరీరంగా మారినాయట. అదియే అర్థనారీశ్వర రూపం.

02/04/2018 - 20:56

ఓ భగవంతుడా! నీవు మాప్రాణాలు తీసుకో అంతేకాని ఈ చిన్ని కృష్ణుని ప్రాణాలకు ఆపద రానివ్వకు. ఈ కాళీయుని విషజ్వాలలకు మా ప్రాణాన్ని బలిపెట్టకు. కృష్ణుడు లేకపోతే మేము లేము. ఓ కృష్ణా! ఎన్నో సార్లు మేము పలుకగానే నీవు ఓ అని పలికేవాడివి గదా. మరి ఇపుడు ఏమైంది నీవు అట్లా సోయ లేకుండా పడుకుని ఉన్నావే. ఒక్కసారి నీవు కనులు తెరిచి మా వైపు చూడు’’అంటూ పరిపరివిధాల భగవంతుడిని కోరుకుంటున్నారు.

02/04/2018 - 20:51

ఆలయాలు ఆధ్యాత్మిక శాస్త్భ్య్రాస కేంద్రాలు. సత్య విజ్ఞాన సాధనాలయాలు. జీవిత రహస్య పరిశోధనాశాలలు. మానసిక రోగ వైద్యశాలలు. మానవాత్మను జాగృతంచేసే మాతృ నిలయాలు. సహస్రాబ్దాలనాడు భారతీయ ఆధ్యాత్మికతను అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోడానికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో వచ్చారు. వారికి ఈ ఆలయాలు విశ్వవిద్యాలయాలుగా రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతుంది.

02/02/2018 - 23:12

ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువు, పుట్టుకకి ఓ లక్ష్యం ఉంది. ఓ తత్త్వముంటుంది. ఉత్కృష్టమైన మానవులుగా పుట్టిన మనం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు మరణిస్తున్నామనీ- ప్రశ్నలకి సమాధానం కోసం కొంచెం లోతుగా పరిశీలించాలి. పరిశీలన చేయాలి.

02/02/2018 - 23:09

ప్రపంచ దేశాల్లో హైందవ ధర్మ శంఖారావాన్ని పూరించిన ధీశాలి వివేకానందులు. రామ్‌మోహన్ దత్త, దుర్గాచరణ్ దత్త, విశ్వనాధ దత్త మొదలైన సుప్రసిద్ధ దత్త కుటుంబ పరంపరలో విశ్వనాధ దత్త, భువనేశ్వరీ దేవి దంపతులకు కారణజన్ముడుగా ఉద్భవించారు. పేరుకు తగ్గట్టుగానే ఆధ్యాత్మిక లోకానికి ఇంద్రుడై హైందవ ధర్మముయొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

Pages