S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
తిరుచానూరులోని పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో వున్న ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై ఐదంతస్తుల శిల్పకళా శోభితమైన గోపురం నిర్మింపబడి వుంది. రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలు వున్న ప్రధాన ఆలయ రంగమండపంలోని స్తంభాలు అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
24.సుందరులతి తేజస్వులు సుగుణవంతు
లన్నదమ్ములు తనవెంట రాగ వౌని
సరయు తీరము జేరి వాత్సల్య పూర్ణు
డౌచు రాకొమరులజూచి రాచ తపసి
25.శ్రమమున్ క్షుత్పిపాసల నాశకములు
బల అతిబల విద్యలు శుభప్రదము లంచు
రామునకుపదేశించె ముని ప్రభుండు
రాముజేరి రాణించు నావిద్యలనుచు
నారాయణ కవచమ్ అత్యంత మహిమాన్వితమైనది. విశ్వరూపుడు అనే మునీశ్వరుడు దీనిని దేవేంద్రునికి ఉపదేశించగా దాని ప్రభావం వలన శత్రువులైన రాక్షసులను జయించాడు. శ్రీమన్నారాయణ స్వరూపమైన ఈ కవచాన్ని నిత్యం పఠించటం వలన విష్ణు భగవానుని అనేక అవతారాలు, అనేక నామాలు, వాహనాలు, దివ్యాయుధాలు అన్నీ సర్వకాల సర్వావస్థలలోను రక్షిస్తూ ఉంటాయి.
జ్ఞానం వల్లనే సర్వ అనర్థాలు కలుగుతాయి. అజ్ఞానం నశిస్తే జ్ఞానం ఉదయిస్తుంది. అపుడు ఇబ్బందులేవీ ఉండవు.దేనినైనా పూర్తిగా తెలుసుకొంటే దానిగురించిన అవగాహన వస్తుంది. పూర్తిగా తెలిసినదే కనుక ఏమీ అనుమానం ఉండదు. కాని ఏ వస్తువు గురించి యైనా పూర్తిగా తెలియకుండానే తెలుసు అనే భ్రమ కలిగితే అపుడు అజ్ఞానం ఆవరిస్తుంది. చీకటిలో పొడవుగా ఉన్న దానిని చూసి దానే్న పాము అనుకొంటే అది అజ్ఞానమవుతుంది.
12.అంత కైకేయి సుతునకు భరతడనెడు
నామ మమరగ జేసి సుమిత్ర సుతుల
కవలులకు లక్ష్మణుడు శతృఘు్నలనెడు
పేర్ల నిర్ణయించెను గురుశ్రేష్ఠుడపుడు
13.దశరధేశున కత్యంత ప్రీతికరుడు
రామభద్రుడు సుగుణాలరాశి యతడు
తల్లులకు తమ్ములకు జనావళికి నెల్ల
సంతతానందదాయి కౌసల్యసుతుడు
దానగుణానికి మించిన ఉత్తమ గుణం వేరొకటి లేదు. మనం చేసే దానం ఇతరులకు శ్రేయస్సునిస్తుందంటే దానం చేయడం మంచిది అని స్వామి వివేకానంద అంటారు. మరణించిన తరువాత మన శరీర అవవయాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసేవారు మరణంలోనూ జీవిస్తారు. తమ జీవితాలు ఆరిపోయినా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేవారు నిజంగా ధన్యులు. తను జీవించి ఉండగానే దేహాన్ని త్యాగం చేసిన త్యాగపురుషుడు దధీచి మహర్షి.
ధవళ వస్త్రంబు దరహాస దంతి ముఖము
ఏక దంతంబుతో వెలుగొందునట్టి
సకల విద్యల కెల్లదానొజ్ఞయైన
కొండ మనుమని కెపుడు దండంబ లిడుదు
1. శ్రీ సమృద్ధవౌ కోసల దేశమందు
సూర్య వంశజు డిక్ష్వాకు చక్రవర్తి
మనువు నిర్మితవౌ అయోధ్యానగరము
రాజధానిగ రాజ్యము జేయుచుండె
అవన్తికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వనే్ద మహాకాలమహం సురేశమ్
భావం: సజ్జనులకు మోక్షమునిచ్చుటకై ఉజ్జయినీ పట్టణమునందు అవతరించి దేవనాయకుడగు మహాకాలుని అకాల మృత్యువునుండి రక్షించుటకై నమస్కరించుచున్నాను. శివశంకరుడు భక్తవశంకరుడు భక్తులపై అపార కృపావర్షాన్ని కురిపించు భవుడు.
జనార్దన
21.జలజలోచన నీదాస జనుల కెలమి
యర్ధ కామములిచ్చు జనార్దనుడవు
నిన్ను నిరసించు మూఢ దానవుల బటిట
దండితులజేయు చక్రహస్తుండ వీశ
ఉపేంద్ర
22.ఇంద్రునకు సోదరుండవు యింద్రియముల
కర్మ మార్గమునందు సక్రమము తోడ
నడుపు నేతవు నిన్ను పేద్రుండటంచు
బుధ జనంబుల సేవింత్రు భక్తితోడ
ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధకుడు ముందుగా ఏకాగ్రత కోసం ప్రాణాయామాన్ని ప్రారంభిస్తాడు. మెల్లగా మనసు, బుద్ధిని స్థిరపరుచుకుంటాడు. ప్రతిరోజునియమ ప్రకారం ప్రాణాయామం, తపస్సు లాంటివి చేస్తున్నా ఒక్కొక్కరు మాకు ఇంకాభగవంతుని సాక్షాత్కారం గాని కనీసం భగవనుభూతి కాని కలుగ లేదని చెప్తుంటారు. భగవనుభూతి అనేది ప్రతివారికి అనుభవైకవేద్యమే. కాని దాన్ని గుర్తించిన వారు తక్కువగా ఉంటారు.