-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 7న నగరానికి వస్తున్నారు. ఆ రోజు జరిగే నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దిగ్విజయ్తో పాటు ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు.
విజయవాడ: నగలకు మెరుగు పెడతామని నమ్మించి సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆగంతకులు దోచుకుపోయిన సంఘటన ఇక్కడి ప్రసాదం పాడులో మంగళవారం జరిగింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.
కాకినాడ: రాజానగరం మండలం బొల్లకడియం వద్ద మంగళవారం ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయల నగదు, 5 బైకులు, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు: తణుకు సమీపాన సజ్జాపురం వద్ద గోస్తని నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. మృతులను లక్ష్మీనరసమ్మ (32), ఆమె కుమార్తె లాస్య (7)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఆదివారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ కలహాల వల్లే కుమార్తెతో పాటు కాల్వలోకి దూకి తల్లి నరసమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
కర్నూలు: అవినీతి, అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమానికి బదులు గడప గడపకూ వెళ్లి జగన్ క్షమాపణలు చెప్పుకోవాలన్నారు.
నెల్లూరు : ఏఎస్పేట పరిధిలోని పలు కాలనీలలో పిచ్చికుక్క గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి : తిరుపతి శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలీల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
తూర్పుగోదావరి: కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కడప : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని, ముగ్గురు తమిళ కూలీలను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా సి.సుమలత, కృష్ణా జిల్లా న్యాయమూర్తిగా వై.లక్ష్మణరావు, కర్నూలు జిల్లా న్యాయమూర్తిగా జి.అనుపమ చక్రవర్తి, నెల్లూరు జిల్లా న్యాయమూర్తిగా మౌలానా జునైద్ అహ్మద్, కడప జిల్లా న్యాయమూర్తిగా జి.సునీత, విశాఖ సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శశిధర్రెడ్డిని నియమించారు.