S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/23/2016 - 05:43

విశాఖపట్నం, జూలై 22: నల్లధనం వెలికతీతలో ఆడిటర్లదే కీలకపాత్రని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్టస్థ్రాయి చార్టడ్ అకౌంటెంట్ల సదస్సు విశాఖలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి యనమల మాట్లాడుతూ నల్లధనం తెల్లధనంగా మారితే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అన్నారు. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలంటే ఆడిటర్లు నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

07/23/2016 - 05:43

విజయవాడ, జూలై 22: పోలీస్... ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నది తన అభిమతమని, అలాగే సమాజంలో పోలీస్ ఇమేజ్ పెంపుకోసం పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ దశలవారీగా సంస్కరణలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇన్‌ఛార్జి డిజిపిగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్న నండూరి సాంబశివరావు అన్నారు.

07/23/2016 - 05:42

విజయవాడ, జూలై 22: గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతోపాటు కేంద్ర ద్వారా చట్ట సంస్కరణ తీసుకువచ్చి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. గత రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పోలీసుశాఖ ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు.

07/23/2016 - 05:41

పోలవరం, జూలై 22: రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకంగా భాసిల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ కార్మికులు సమ్మెకు దిగడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శుక్రవారం నుండి నిలిచిపోయాయి.

07/23/2016 - 05:40

గుంటూరు, జూలై 22: రాజధాని ప్రాంతంలో మరోసారి భూ సేక..రణం మొదలైంది.. ఇటీవల వరకు సీఆర్డీయే అధికారులు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో సామాజిక సర్వేని పూర్తిచేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని, భూ సమీకరణకు ఇచ్చిన ప్యాకేజీ సేకరణ జరిపే రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి ఓ సందర్భంలో స్పష్టం చేశారు.

07/23/2016 - 05:39

విజయవాడ, జూలై 22: రాష్ట్రంలో ఐదుగురు ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. విశాఖ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్ యువరాజ్‌ను బదిలీ చేశారు. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ (జిఎడి)కి రిపోర్ట్ చేయమన్నారు. యువరాజ్ సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్లనున్నారు. యువరాజ్ స్థానంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు.

07/23/2016 - 05:38

ఆకివీడు, జూలై 22: వింత వ్యాధితో బాధపడుతున్న ఆకివీడు మండలం చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. గత పది రోజులుగా పాఠశాలకు వచ్చిన విద్యార్ధిని విద్యార్ధులు వింత వ్యాధికి గురై కళ్లు తిరిగి పడిపోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.

07/23/2016 - 05:38

విజయవాడ, జూలై 22: పార్టీ శ్రేణులకు సిఎం చంద్రబాబు కొత్త అసైన్‌మెంట్ ఇచ్చారు. పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల గురించి పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నాయని చంద్రబాబు చాలా కాలంగా ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు రేటింగ్ ఇచ్చి, అట్టడుగు రేటింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సహా 400 మంది పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవతున్నారు.

07/23/2016 - 03:45

విజయవాడ, జూలై 22: కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ స్థానిక మంజునాథ్ కమిషన్ ఎదుట పలు బిసి సంఘాలు శుక్రవారం ఆందోళన జరిపాయి. అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిసి సంఘాలు శుక్రవారం విజయవాడ చేరుకున్నాయి. స్థానిక బెంజ్ సర్కిల్ దగ్గరున్న మంజునాథన్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకువెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు.

07/22/2016 - 18:22

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఇక్కడి ఆంధ్రరత్న భవన్ వద్ద దగ్ధం చేశారు. ప్రత్యేక హోదాపై ఎపి సిఎం చంద్రబాబు ఇకనైనా తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు.

Pages