జాతీయ వార్తలు

2న కోల్ ఇండియా కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా కార్మికులు.. వచ్చే నెల 2న దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు కోల్ ఇండియా శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. కాగా, సంస్థలో మరింతగా పెట్టుబడుల ఉపసంహరణలు, వ్యూహాత్మక విక్రయాలకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. మరోవైపు సమ్మెతో బొగ్గు ఉత్పత్తి, తరలింపునకు తీవ్ర అంతరాయం కలగనుంది. నిరుడు సెప్టెంబర్‌లోనూ దాదాపు 4 లక్షల మంది కార్మికులు సమ్మె చేసినది తెలిసిందే. ప్రధాన వాణిజ్య సంఘాలు సమ్మెకు మద్దతునిస్తున్నాయ.